వృథాగా నీరు.. శివారు రైతులకు కన్నీరు..!
నెల్లూరు: వరికుంటపాడు మండలంలో గండిపాలెం జలాశయం అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతున్నారు. కాల్వల్లో పూడిక, కంపచెట్లు, ఆక్రమణలు తొలగించకుండానే నీరు విడుదల చేయడంతో 11 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. నీరంతా వృథాగా పోతుండగా, చివరి ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పడం లేదు. వెంటనే కాల్వలు శుభ్రం చేసి సాగునీరు అందించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.