అర్జీలు స్వీకరించిన కలెక్టర్
CTR: చిత్తూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జేసి విద్యాధరి, డిఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.