అర్హులైన జర్నలిస్ట్లకు అక్రిడిటేషన్ కార్డులు
SRPT: జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీడియాపై ఉందన్నారు. ఈనెల 24వ తేదీ సాయంత్రంలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.