అమ్మవారికి విలువైన లక్ష్మీ హారం సమర్పణ
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారికి భక్తులు తమ భక్తిశ్రద్ధలను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ రామచంద్ర నగర్కు చెందిన శ్రీ దేవి శ్రీ రమ్య కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి విలువైన బంగారు లక్ష్మీ హారాన్ని శనివారం సమర్పించారు. రాళ్లు పొదిగిన ఈ హారం సుమారు 42 గ్రాముల బరువుతో ఉండి, దాని విలువ దాదాపు రూ. 6,35,000 ఉంటుందన్నారు.