నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కడప కలెక్టరేట్లోని సభా భవనంలో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సభా భవనంలో నిర్వహించే వేదికకు కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఇతర అధికారులు పాల్గొంటున్న నేపథ్యంలో తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు.