'ఐవీఆర్ఎస్ కాల్స్కు ప్రజలు స్పందించాలి'
ASR: చెత్త సేకరణ కార్యక్రమంపై ప్రభుత్వం నుంచి వచ్చే ఐవీఆర్ఎస్ కాల్స్కు తప్పకుండా స్పందించాలని కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీ అభివృద్ధి అధికారిణి మోనిక ప్రజలను కోరారు. శనివారం కొత్తవీధి, సోలాబు, జోగుంపేటల్లో ఆమె పర్యటించారు. ప్రజలతో సమావేశమయ్యి, చెత్త సేకరణ కార్యక్రమం పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. చెత్త ఐవీఆర్ఎస్ కాల్స్కు జవాబు ఇవ్వాలని కోరారు.