10 బృందాలతో గాలింపు: పోలీసులు

HYD: చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్లో కాల్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే దుకాణంలోకి ముఠా చొరబడి గన్తో బెదిరించి లాకర్ కీ అడగగా అసిస్టెంట్ మేనేజర్ ఇవ్వకపోవడంతో కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు ఫోన్ చేయడంతో ముఠా పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుల కోసం 10 బృందాలతో గాలిస్తున్నట్లు తెలిపారు.