వర్ల రామయ్యని పరామర్శించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

కృష్ణా: తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు సోమవారం పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వర్ల ఇటీవల హైదారాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో శస్త్రచికిత్స చేయించుకుని విజయవాడకి తిరిగి రావడం జరిగింది. ఈ క్రమంలో పలువురు టీడీపి నేతలు, కార్యకర్తలు రామయ్యని పరామర్శిస్తున్నారు.