డబుల్ డెత్ కేసు.. ఐదుగురి అరెస్ట్
HYD: చాంద్రాయణగుట్టలో సంచలనం రేపిన డబుల్ డెత్ కేసును పోలీసులు ఛేదించారు. సైఫ్ ఇచ్చిన స్టేట్మెంట్తో మొత్తం గ్యాంగ్ బయటపడింది. మత్తు ఇంజెక్షన్ల కొనుగోలు-అమ్మకాల గుట్టు బయటపడింది. అయితే, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు యువకులు మృతి చెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండు తరలించారు.