భక్తుల ఇంటికే రాములోరి కళ్యాణ తలంబ్రాలు
MNCL: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించినట్టు మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కల్యాణ తలంబ్రాల బుకింగ్స్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కళ్యాణ తలంబ్రాల ప్యాకెట్లకు 9866771482 నంబర్లో సంప్రదించాలని సూచించారు.