ఫోన్ పోయిందా.. ఈజీగా దొరికేస్తుందిలా..!

HYD: నగరంలో నిత్యం అనేక సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. ఇటీవల రాచకొండ, సైబరాబాద్, HYD కమిషనరేట్ పరిధిలో వేల కొద్ది చోరీకి గురైన ఫోన్లు అధికారులు బాధితులకు అందజేశారు. ఫోన్ పోతే ఏం చేయాలో పోలీసులు సూచించారు. www.ceir.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేస్తే డీటెయిల్స్ నమోదవుతాయి. వేరే వాళ్లకు అమ్మినా, ఇంకో సిమ్ ఆ ఫోన్లో వేసినా పోలీసులకు వివరాలు అందుతాయి.