జపాన్ నుంచి విద్యార్థినికి ఆహ్వానం
సత్యసాయి: గుంతకల్లు మండలం కసాపురం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని కావలి జ్యోతి రూపొందించిన ‘సోలార్ మల్టీపర్పస్ పోర్టబుల్ టెంట్’ ప్రాజెక్టు అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ క్రమంలో జపాన్ దేశం నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. జ్యోతి రూపొందించిన టెంట్ ద్వారా తల్లులు శిశువులకు పాలు పట్టవచ్చు. అలాగే సోలార్ వెలుతురులో బస చేయవచ్చు.