గన్నవరంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

గన్నవరంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని పి. నైనవరంలో ఏపీ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై 455 మంది రైతులకు పాస్‌ పుస్తకాలు అందజేశారు. గత ప్రభుత్వం రైతుల పాస్‌ పుస్తకాలపై జగన్ ఫొటో ముద్రించడం తప్పని విమర్శించారు.