'విద్యారంగం బలోపేతానికై పోరాడుదాం'
BDK: PDSU, PYL ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన స్ఫూర్తియాత్ర ఇవాళ భద్రాచలం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ముగిసింది. PDSU అధ్యక్షుడు కాంపాటి పృధ్వీ మాట్లాడుతూ.. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల స్ఫూర్తితో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై సమరశీల పోరాటాలకు రూపకల్పన చేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ సవరించి కనీసం 20 శాతం నిధులు మంజూరు చేయాలన్నారు.