VIDEO: పిండిప్రోలులో ఏజెంట్లను అడ్డుకున్న పోలీసులు.!
KMM: తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు పోలింగ్ కేంద్రం వద్ద లోనికి వెళ్లకుండా ఏజెంట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతమంది ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతున్నా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయా గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏజెంట్లనులోనికి అనుమతించారు.