'ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు'
NZB: గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొలి, రెండోవిడత నామినేషన్ల స్వీకరణ పూర్తయిన నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలన్నారు.