దెబ్బతిన్న పంటలను పరిశీలించిన MLA
MHBD: మున్సిపాలిటీ పరిధిలోని ఏటిగడ్డతండా సమీపంలో మున్నేరు వాగు వద్ద మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న రోడ్డు, కూలిన విద్యుత్ స్తంభాలు, ఇసుక మేటలతో నష్టపోయిన వరి పొలాలను ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ గురువారం పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రజల భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.