VIDEO: క్యాంపు కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా
WNP: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రూ. 8500 కోట్ల బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.