'కొర్రీలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి'
BHNG: రైతులకు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పత్తిని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రామన్నపేట మండలాధ్యక్షుడు పోషబోయిన మల్లేశం డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పత్తి పంట సాగు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు.