VIDEO: ఖమ్మంలో పెరిగిన కొత్త మిర్చి ధర
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,100, కొత్త మిర్చి రూ.15111 పత్తి ధర రూ.7,500 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే కొత్త మిర్చి ధర రూ.252, పత్తి ధర పెరగగా.. అటు ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.