ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌కు నలుగురు ఎంపిక

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌కు నలుగురు ఎంపిక

అల్లూరి: పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ చేసే పరిశోధనకు ఎంపికయ్యారు. ఎంపికైన వైద్య విద్యార్థులు ప్రొఫెసర్ రాధాకుమారి ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ నియమ నిబంధనలను అనుసరించి పరిశోధనలు చేస్తారు. విద్యార్థులు ఐసీఎంఆర్ పరిశోధనలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ డీ.హేమలతదేవి అన్నారు.