'భోజన వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి'

SRD: హత్నూర మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు సంఖ్యను ఎండీఎం మొబైల్ యాప్లో నమోదు చేయాలని ఎంఈవో వెంకట నరసింహులు అన్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల లోపల యాప్లో నమోదు చేయాలని తెలిపారు. మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం పెట్టాలని సూచించారు.