ఈనెల 9న PM నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా
MNCL: మంచిర్యాల ప్రభుత్వ ITIలో ఈనెల 9న PM నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రమేశ్ గురువారం తెలిపారు. 11 కంపెనీలలో మొత్తం 395 ఖాళీలు ఉన్నాయని, శిక్షణ సమయంలో స్టైఫండ్ అందజేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న అప్రెంటిషిప్ మేళాకు అర్హులైన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు.