పేదలకు ఇళ్లు ఇవ్వాలి: సీపీఎం

పేదలకు ఇళ్లు ఇవ్వాలి: సీపీఎం

NDL: అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం మండల నాయకులు మహబూబ్ బాషా డిమాండ్ చేశారు. బుధవారం ఆత్మకూరు మండలం తాహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి 18 నెలలు గడుస్తున్న ఇంతవరకు ఇళ్లు, స్థలాలు, నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.