ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

WNP: జిల్లాలో రానున్న మూడు రోజులు భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పి రావుల గిరిధర్ సూచించారు. ఇవాళ సాయంత్రం మదనాపురం మండలంలోని సరళసాగర్ ప్రాజెక్ట్ను కలెక్టర్, ఎస్పీ సందర్శించి నీటిమట్టం, ఉధృతిని పరిశీలించారు. వాగులు, కుంటలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని అన్నారు. దింతో ఏమైనా కార్యక్రమాలు ఉంటే వాయిదా వేసుకోవాలన్నారు.