ఏప్రిల్ 4న ఎంజీయూలో మెగా జాబ్ మేళా
NLG: నల్లగొండలోని మహాత్మ గాంధీ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు విద్యతో పాటు ఉపాది, ఉద్యోగ అవకాశాల కల్పనకే మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం ఎంజీయూలో వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న నిర్వహించే మెగా జాబ్ మేళా పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.