BREAKING: ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్ దాడులపై US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఖతార్పై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇరాన్లోని 'సౌత్ పార్స్' గ్యాస్ క్షేత్రాన్ని పేల్చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఆ గ్యాస్ ఫీల్డ్పై దాడులు జరిగాయని, అయితే వాటితో USకు సంబంధం లేదని, ఆ విషయం తమకు తెలియదని పేర్కొన్నారు. యుద్ధం నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.