రేపు ఎమ్మెల్యే కార్యాలయంలో వినతుల స్వీకరణ

రేపు ఎమ్మెల్యే కార్యాలయంలో వినతుల స్వీకరణ

చిత్తూరు: నగరంలోని లక్ష్మీ నగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు MLA గురజాల జగన్మోహన్ గురువారం తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ప్రజలు వినతి పత్రంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ జతపరచాలన్నారు.