'గవర్నర్ పదవి పట్ల హర్షం'

VZM: రాజ్యాంగ విలువలు పాటించే మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు రాజ్యాంగబద్ధ పదవి వరించిందని గజపతినగరం మార్కెట్ కమిటీ అధ్యక్షులు పీవీవీ గోపాలరాజు అన్నారు. మంగళవారం గోవా గవర్నర్గా నియమించబడిన అశోక్ గజపతిరాజును గోపాలరాజు అభినందించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.