గుత్తిలో బీజేపీలోకి చేరికలు

గుత్తిలో బీజేపీలోకి చేరికలు

ATP: గుత్తి పట్టణానికి చెందిన గుర్రం మనోహర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ ప్రధాన కార్యదర్శి చామంతుల ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.