పులివెందుల ప్రజా దర్బార్లో ఎంపీ

KDP: పులివెందుల పట్టణంలోని బాకరాపురంలో ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసంలో బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలు, ప్రజలు, వినతి పత్రాలను ఎంపీ అవినాశ్ రెడ్డికి అందజేసి వారి సమస్యలను ఆయనకు వివరించారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు