ఆలయంలో ఘనంగా చండీ హోమం

ఆలయంలో ఘనంగా చండీ హోమం

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం అమావాస్య సందర్భంగా నర్సాపురం పట్టణానికి చెందిన మాదిరెడ్డి ఆనంద్, గాయత్రిరాణి దంపతులు ఘనంగా చండీహోమం నిర్వహించారు. చండీ హోమం నిర్వాహకులు ఆగమ పండితులు అచ్యుత రామారావు శర్మ వేదమంత్రాలతో హోమాన్ని జరిపించారు. ఈవో మోక అరుణ్‌ కుమార్   ఆధ్వర్యంలో సిబ్బంది తగిన పర్యవేక్షణ నిర్వహించారు.