'పంట సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి'
RR: కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం షాద్నగర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. అనంతరం రైతుల నుంచి సేకరించిన నిల్వల నాణ్యతను పరిశీలించారు.