సీఎం పర్యటనకు పటిష్ట భద్రత

సీఎం పర్యటనకు పటిష్ట భద్రత

GNTR: ఉద్దండరాయునిపాలెంలో సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సభా ప్రాంగణాన్ని కలెక్టర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. సీఎం రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని సందర్శించి, రైతులతో భేటీ కానున్నారు. అమరావతి బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.