సీఎం రేవంత్తో విన్ గ్రూప్ ఆసియా CEO భేటీ
TG: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో విన్ గ్రూప్ ఆసియా సీఈవో భేటీ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకు విన్ గ్రూప్ ఆసక్తి చూపింది. ఈవీలు, బ్యాటరీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు రావాలని సీఎం రేవంత్.. వారిని ఆహ్వానించారు.