బెస్త గూడెంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

బెస్త గూడెంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

MLG: వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన గుండారపు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అడవి ప్రాంతంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. నేడు అటువైపు వెళ్తున్న గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గత మూడు రోజుల నుండి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.