ప్రొసీడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్
MBNR: స్థానిక ఎన్నికలు ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించాలని రెవెన్యూ అదరపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా హన్వాడ, కోయిలకొండ, గండీడ్ మండలాలలో మంగళవారం నిర్వహించిన ప్రొసీడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు అందించారు.