పారిశ్రామిక వేత్తలకు ఏపీఐఐసీ బంపర్ ఆఫర్
అనంతపురం ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో రోడ్లు, వీధి దీపాల మరమ్మతులు వెంటనే చేపడతామని జోనల్ మేనేజర్ నాగకుమార్ హామీ ఇచ్చారు. సోమవారం జరిగిన ఐలా సమావేశంలో కూడేరు, తిమ్మసముద్రం, ఊరిచింతల ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈ ప్లాట్ల వివరాలను వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భూమి విలువపై 75 శాతం రాయతీ ఉంటుందని ప్రకటించారు.