ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్టు అడ్వైజరీ జారీ
ఇండిగో సంక్షోభం కారణంగా ఆదివారం ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో సుమారు 220కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈరోజు కూడా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని తెలిపింది. ప్రయాణికులు ఎయిర్పోర్టుకు వచ్చే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది.