బీసీలను కాంగ్రెస్ మరోసారి మోసం చేస్తోంది: తలసాని
HYD: బీసీ సమాజాన్ని కాంగ్రెస్ మరోసారి మోసం చేస్తోందిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి.. కులగణన సక్రమంగా చేయలేదని అన్నారు. ఇప్పటి వరకు డెడికేటెడ్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. దిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా పేరుతో కాంగ్రెస్ నేతలు కొన్ని రోజులు హంగామా చేశారని మండిపడ్డారు.