110కి పెరిగిన మృతుల సంఖ్య
అఫ్గానిస్తాన్లో వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతోంది. ఈ వరదల కారణంగా మృతుల సంఖ్య 110కి పెరిగింది. మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 12 రోజులుగా అఫ్గాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.