నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన

నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన

RR: ఫరూఖ్ మండలం చించోడు రైతు వేదికలో రైతులకు నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, నూనెగింజల పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు, నిపుణులు రైతులకు నానో ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. నానో ఎరువులను సరైన మోతాదులో పంటలకు పిచికారి చేయడం ద్వారా పంటల ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు.