అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 52, 89, 90వ వార్డుల్లో సుమారు రూ.2.39 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే లక్ష్యంతో ఈ పనులను చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.