నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఏలూరు మండలం శాంతినగర్ సెక్షన్, వట్లూరు సబ్ స్టేషన్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ అంబేద్కర్ తెలిపారు. లైన్ మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, అధికారులకు సహకరించాలని కోరారు.