బోధన్లో 8వ తరగతి విద్యార్థిని కిడ్నాప్

TG: నిజామాబాద్ జిల్లా బోధన్లో ఓ విద్యార్థిని కిడ్నాప్కు గురైంది. ఎడపల్లి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తన కూతురు కిడ్నాప్ అయిందని.. తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ బాలికను ఓ మహిళ తీసుకెళ్లి బాన్సువాడ బస్సు ఎక్కినట్లు కెమెరాల సాయంతో పోలీసులు గుర్తించారు.