రైతులు అగ్రిమెంట్ తీసుకోవాలి: ఏవో వాణి
KMM: కూసుమంచి మండలంలోని ముత్యాలగూడెం, నేలపట్లలో రైతులకు మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి అవగాహన సదస్సు నిర్వహించారు. మొక్కజొన్న సాగు చేసే రైతులు కంపెనీల ఏజెంట్ల నుంచి అగ్రిమెంట్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఏజెంట్ల ద్వారా విత్తనాలు కొనుగోలు చేయవద్దని కోరారు.