మంత్రి లోకేష్ని కలిసిన హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

NTR: ఉండవల్లిలో ప్రజాదర్బార్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ని హౌసింగ్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్షుడు శేషం తిరుపతిరావు మాట్లాడుతూ.. హౌసింగ్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా వారిని గుర్తించాలని కోరారు.