ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా ఆయన గోడౌన్లోని భద్రతా చర్యలను పరిశీలించారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించిన కలెక్టర్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి సంతకం చేశారు.