అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

MNCL: మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన మంగళవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనకు చెందిన అజ్మీరా సుఖేందర్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.