వైద్య శిబిరాన్ని సందర్శించిన డీహెచ్ఎంవో

వైద్య శిబిరాన్ని సందర్శించిన డీహెచ్ఎంవో

కృష్ణా: మచిలీపట్నం మండలం కరగ్రహారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని డీహెచ్ఎంవో యుగంధర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. రక్తపోటు, మధుమేహం, జ్వరాలు తదితర సాధారణ వ్యాధులపై పరీక్షలు చేసి, వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.